అమరావతి రాజధానిలో జరుగుతున్న పనుల్లో కూటమి సర్కార్ భారీ అవినీతికి తెర తీసిందని వైయస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు వైయస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తనకు అనుకూలమైన ఎనిమిది సంస్థలకే 59 ప్యాకేజీల కింద మొత్తం రూ.28,210 కోట్ల విలువైన పనులను కట్టబెట్టారని అన్నారు. వీటికి మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద ఇచ్చే రూ.2821 కోట్ల నుంచే 8 శాతం కమిషన్లుగా దండుకుంటున్నారని మండిపడ్డారు. తన అవినీతికి అడ్డం వస్తాయనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వంలో వైయస్ జగన్ గారు తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాలను పూర్తిగా తొలగించారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దోచుకోవడం, దాచుకోవడం అనే విధానాన్ని అనుసరిస్తోంది. ప్రజాధనంను పెద్ద ఎత్తున లూఠీ చేస్తోంది. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పారదర్శక విధానాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. తాజాగా రాజధాని అమరావతి పనుల్లో వేల కోట్ల రూపాయల దోపిడీకి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తమకు అనుకూలమైన సంస్థలను ఎంపిక చేసుకుని, వాటికి అధిక రేట్లకు టెండర్లను కట్టబెట్టడం, వారికే మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయడం, దాని నుంచి తిరిగి కమీషన్లను దండుకోవడంను ఒక వ్యవస్తీకృత విధానంలాగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఒకచేత్తో అడ్వాన్లను ఇవ్వడం, మరోచేత్తో వారి నుంచి కమీషన్లను అందుకోవడం కూటమి ప్రభుత్వ కొత్త పాలసీగా కనిపిస్తోంది.
దోచుకోవడంపైనే చంద్రబాబు దృష్టి
చంద్రబాబు పాలన అంటేనే దోచుకోవడం. ప్రారంభంలో రాష్ట్ర రాజధాని పేరుతో అందరి దృష్టి మళ్ళించి అమరావతి ప్రాంతంలో తాను, తన బినామీలతో కారుచౌకగా భూములను ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూముల విలువ వందరెట్లు పెరిగాయి. చంద్రబాబు, ఆయన బినామీలు అపర కుబేరులుగా మారారు. అలాగే అమరావతి నిర్మాణం అంటూ 2014-19 మధ్యన చంద్రబాబు షాపూర్జీ-పల్లోంజీ సంస్థకు వేల కోట్ల రూపాయల పనులు అప్పగించారు. ఈ సంస్థ నుంచి కమిషన్లు వసూలు చేసిన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని సాక్ష్యాధారాలతో సహా ఆదాయపన్ను అధికారులు పట్టుకున్నారు. ఇప్పుడు అదే వ్యక్తి కూటమి ప్రభుత్వంలో రాజధాని పనుల్లో చక్రం తిప్పుతున్నాడు.
గత టీడీపీ ప్రభుత్వంలో భారీ అవినీతి
గతంలో పట్టిసీమ పనులకు సంబంధించి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అవ్వడం వల్ల దాదాపు రూ.258 కోట్ల మేర కుంభకోణం జరిగింది. దీనిని ఆనాడే అసెంబ్లీలో వైయస్ జగన్గారు ప్రశ్నించారు, అంతేకాదు 2017-18 లో కాగ్ కూడా దీనిపై తెలుగుదేశం ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగడుతూ నివేదిక ఇచ్చింది. అలాగే వైకుంఠాపురం బ్యారేజీ కోసం దాదాపు రూ.400 కోట్లు అంచనాలు పెంచి, 13.19 శాతం అధిక రేట్లకు నిబంధనలకు విరుద్దంగా ఆ కాంట్రాక్ట్ను ఖరారు చేసి దాని నుంచి చంద్రబాబు లబ్ధిపొందారు. అలాగే పోలవరం హెడ్ వర్క్స్ జలవిద్యుత్ కేంద్రం పనులను నవయుగ కంపెనీకి 4.8శాతం అధిక రేట్లతో రూ. 3216 కోట్ల రూపాయలకు కట్టబెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో కాంట్రాక్టర్లను అడ్డుపెట్టి ఖజానాను దోచుకునేందకు సిద్దపడ్డారు.
ఆ 8 సంస్థలకే ఎందుకు
చంద్రబాబుకు సన్నిహితమైన ఎనిమిది సంస్థలకే మొత్తం పనులను కట్టబెట్టారు. మెగా కృష్ణారెడ్డి, ఈనాడు పత్రిక అధినేత చెరుకూరి కిరణ్ బంధువు రాయల్ రఘుకు చెందిన ఆర్విఆర్ ప్రాజెక్ట్, చంద్రబాబు సన్నిహితుడు బీఎస్ఆర్ ఇన్ఫ్రా వ్యవస్థాపకుడు బలుసు శ్రీనివాస్, ఏవీ రంగరాజుకు చెందిన ఎన్సీపీ, మంత్రి నారా లోకేష్కు సన్నిహితుడు కనకమేడ వరప్రసాద్కు చెందిన కెఎంయు, ఎల్అండ్టీ వంటి సంస్థలకే ఈ పనులు కట్టబెట్టారు. వాటిల్లో ఎన్సీసీ సంస్థకు రూ.6124 కోట్లు, బీఎస్ఆర్ కు రూ.6214 కోట్లు, ఆర్వీఆర్ సంస్థకు రూ.6031 కోట్లు, మెగా సంస్థకు రూ.7022 కోట్లు, ఎంవీఆర్ సంస్థకు రూ.796 కోట్లు, ఎల్అండ్టీ కి రూ.809 కోట్లు, కెఎంవి సంస్థకు రూ.429 కోట్లు, బిఎస్పిసీఎల్ సంస్థకు రూ.779 కోట్ల విలువైన పనులను అప్పగించారు.
అమరావతి కాంట్రాక్ట్ల్లో భారీ అవినీతి
అమరావతి రాజధానిలో జరుగుతున్న పనుల్లో కూటమి సర్కార్ భారీ అవినీతికి తెర తీసిందని వైయస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు వైయస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తనకు అనుకూలమైన ఎనిమిది సంస్థలకే 59 ప్యాకేజీల కింద మొత్తం రూ.28,210 కోట్ల విలువైన పనులను కట్టబెట్టారని అన్నారు. వీటికి మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద ఇచ్చే రూ.2821 కోట్ల నుంచే 8 శాతం కమిషన్లుగా దండుకుంటున్నారని మండిపడ్డారు. తన అవినీతికి అడ్డం వస్తాయనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వంలో వైయస్ జగన్ గారు తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాలను పూర్తిగా తొలగించారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దోచుకోవడం, దాచుకోవడం అనే విధానాన్ని అనుసరిస్తోంది. ప్రజాధనంను పెద్ద ఎత్తున లూఠీ చేస్తోంది. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పారదర్శక విధానాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. తాజాగా రాజధాని అమరావతి పనుల్లో వేల కోట్ల రూపాయల దోపిడీకి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తమకు అనుకూలమైన సంస్థలను ఎంపిక చేసుకుని, వాటికి అధిక రేట్లకు టెండర్లను కట్టబెట్టడం, వారికే మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయడం, దాని నుంచి తిరిగి కమీషన్లను దండుకోవడంను ఒక వ్యవస్తీకృత విధానంలాగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఒకచేత్తో అడ్వాన్లను ఇవ్వడం, మరోచేత్తో వారి నుంచి కమీషన్లను అందుకోవడం కూటమి ప్రభుత్వ కొత్త పాలసీగా కనిపిస్తోంది.
దోచుకోవడంపైనే చంద్రబాబు దృష్టి
చంద్రబాబు పాలన అంటేనే దోచుకోవడం. ప్రారంభంలో రాష్ట్ర రాజధాని పేరుతో అందరి దృష్టి మళ్ళించి అమరావతి ప్రాంతంలో తాను, తన బినామీలతో కారుచౌకగా భూములను ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూముల విలువ వందరెట్లు పెరిగాయి. చంద్రబాబు, ఆయన బినామీలు అపర కుబేరులుగా మారారు. అలాగే అమరావతి నిర్మాణం అంటూ 2014-19 మధ్యన చంద్రబాబు షాపూర్జీ-పల్లోంజీ సంస్థకు వేల కోట్ల రూపాయల పనులు అప్పగించారు. ఈ సంస్థ నుంచి కమిషన్లు వసూలు చేసిన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని సాక్ష్యాధారాలతో సహా ఆదాయపన్ను అధికారులు పట్టుకున్నారు. ఇప్పుడు అదే వ్యక్తి కూటమి ప్రభుత్వంలో రాజధాని పనుల్లో చక్రం తిప్పుతున్నాడు.
గత టీడీపీ ప్రభుత్వంలో భారీ అవినీతి
గతంలో పట్టిసీమ పనులకు సంబంధించి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అవ్వడం వల్ల దాదాపు రూ.258 కోట్ల మేర కుంభకోణం జరిగింది. దీనిని ఆనాడే అసెంబ్లీలో వైయస్ జగన్గారు ప్రశ్నించారు, అంతేకాదు 2017-18 లో కాగ్ కూడా దీనిపై తెలుగుదేశం ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగడుతూ నివేదిక ఇచ్చింది. అలాగే వైకుంఠాపురం బ్యారేజీ కోసం దాదాపు రూ.400 కోట్లు అంచనాలు పెంచి, 13.19 శాతం అధిక రేట్లకు నిబంధనలకు విరుద్దంగా ఆ కాంట్రాక్ట్ను ఖరారు చేసి దాని నుంచి చంద్రబాబు లబ్ధిపొందారు. అలాగే పోలవరం హెడ్ వర్క్స్ జలవిద్యుత్ కేంద్రం పనులను నవయుగ కంపెనీకి 4.8శాతం అధిక రేట్లతో రూ. 3216 కోట్ల రూపాయలకు కట్టబెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో కాంట్రాక్టర్లను అడ్డుపెట్టి ఖజానాను దోచుకునేందకు సిద్దపడ్డారు.
ఆ 8 సంస్థలకే ఎందుకు
చంద్రబాబుకు సన్నిహితమైన ఎనిమిది సంస్థలకే మొత్తం పనులను కట్టబెట్టారు. మెగా కృష్ణారెడ్డి, ఈనాడు పత్రిక అధినేత చెరుకూరి కిరణ్ బంధువు రాయల్ రఘుకు చెందిన ఆర్విఆర్ ప్రాజెక్ట్, చంద్రబాబు సన్నిహితుడు బీఎస్ఆర్ ఇన్ఫ్రా వ్యవస్థాపకుడు బలుసు శ్రీనివాస్, ఏవీ రంగరాజుకు చెందిన ఎన్సీపీ, మంత్రి నారా లోకేష్కు సన్నిహితుడు కనకమేడ వరప్రసాద్కు చెందిన కెఎంయు, ఎల్అండ్టీ వంటి సంస్థలకే ఈ పనులు కట్టబెట్టారు. వాటిల్లో ఎన్సీసీ సంస్థకు రూ.6124 కోట్లు, బీఎస్ఆర్ కు రూ.6214 కోట్లు, ఆర్వీఆర్ సంస్థకు రూ.6031 కోట్లు, మెగా సంస్థకు రూ.7022 కోట్లు, ఎంవీఆర్ సంస్థకు రూ.796 కోట్లు, ఎల్అండ్టీ కి రూ.809 కోట్లు, కెఎంవి సంస్థకు రూ.429 కోట్లు, బిఎస్పిసీఎల్ సంస్థకు రూ.779 కోట్ల విలువైన పనులను అప్పగించారు.
RECENT POSTS
TOP STORIES