Andhrabeats

పాక్‌ను డ్రోన్లన్నింటినీ కూల్చేశాం 

India Briefing about War
భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్‌ చేసిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు కేంద్రం తెలిపింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, కల్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికాసింగ్‌లు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆపరేషన్‌ సింధూర్‌కి సంబంధించిన కీలకమైన విషయాలను అధికారికంగా వెల్లడించారు. పాకిస్తాన్‌ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చేసినట్లు చెప్పారు. పాకిస్తాన్‌ భారత్‌లోని 36 ప్రాంతాల్లో 300–400 డ్రోన్లను లేహ్‌ నుంచి సర్‌ క్రీక్‌ వరకు భారత స్థావరాలే లక్ష్యంగా ప్రయోగించినట్లు తెలిపారు. 15 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. వాటన్నింటినీ తిప్పికొట్టాం.
‘‘మా సైనిక బలగాలు కైనెటిక్, నాన్‌–కైనెటిక్‌ పద్ధతులను ఉపయోగించి వందలాది పాకిస్తాన్‌ డ్రోన్లను కూల్చివేశాయి. బఠిండా సైనిక స్థావరంపై దాడి చేయడానికి పంపిన ఒక పాకిస్తాన్‌ ఆయుధ డ్రోన్‌ను కూడా నిర్వీర్యం చేశాం’’ అని కల్నల్‌ సోఫియా ఖురేషీ తెలిపారు. ఈ దాడులను తిప్పికొట్టడానికి ఇంటిగ్రేటెడ్‌ కౌంటర్‌ ్ఖఅ  గ్రిడ్, రష్యా తయారీ –400 త్రిఎంఫ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌లను ఉపయోగించినట్లు చెప్పారు. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఉథంపూర్, బఠిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్లై, భుజ్‌ తదితర ప్రాంతాలు లక్ష్యంగా చేసుకుని పాక్‌ సైన్యం దాడులకు దిగినట్లు తెలిపారు.
పాకిస్తాన్‌ సాధారణ పౌరులు తిరిగే విమానాలను రక్షణ కవచంగా ఉపయోగించుకుని దాడులకు తెగబడినట్లు పేర్కొన్నారు. లాహోర్‌ నుంచి కరాచీకి సివిలియన్‌ విమానాలు నడిచాయి. ఇది పాక్‌ సరిహద్దుల్లో ప్రయాణించే అంతర్జాతీయ విమానాల భద్రతకు ప్రమాదకరం అని వింగ్‌ కమాండర్‌ వ్యోమిక సింగ్‌ తెలిపారు.
పాక్‌ చెప్పేవనీ అబద్ధాలే : విక్రమ్‌ మిస్రీ
విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పాకిస్తాన్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. ‘‘పూంచ్‌లోని గురుద్వారాపై పాకిస్తాన్‌ దాడి చేసింది. ఈ దాడిలో స్థానిక సిక్కు సమాజ సభ్యులు కొందరు ప్రాణాలు కోల్పోయారు. వారు దాడి చేసి భారత్‌ ననకానా సాహిబ్‌ గురుద్వారాపై డ్రోన్‌ దాడి చేసిందని పాకిస్తాన్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్‌ అసత్య ప్రచారానికి అంతే లేదు’ అని విరుచుకుపడ్డారు.
మే 7న భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్, కాశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్తాన్‌ మద్దతుతో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మాత్రమే జరిగిందని మిస్రీ స్పష్టం చేశారు. ‘‘మా సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మాత్రమే దాడి చేసింది. పాకిస్తాన్‌ మాత్రం సామాన్య పౌరులు, ఎయిర్‌పోర్టులు, ప్రార్థనా మందిరాలపై దాడులకు దిగింది. వాటిని తిప్పికొట్టాం’ అని స్పష్టం చేశారు.
టర్కీ పంపిన డ్రోన్లతో పాక్‌ యుద్ధం
కల్నల్‌ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ పాకిస్తాన్‌ ఉపయోగించిన డ్రోన్లు టర్కీ తయారీ  ౖNఎఅఖడ్రోన్లని ప్రాథమిక విశ్లేషణలో తేలిందని తెలిపారు. ‘‘ఈ డ్రోన్ల మన సమాచారాన్ని సేకరించడానికి, భారత్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌లను పరీక్షించడానికి ఉపయోగించారు’ అని ఆమె వివరించారు.

TOP STORIES