అనంతపురం జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో కారు నుజ్జునుజ్జు కాగా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దట్టమైన మంచు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులు బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్ గుర్తించారు. వీరంతా హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందారు.