దేశంలో 25 లక్షల మంది ఎయిడ్స్ బాధితులు
ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన ఎయిడ్స్ ప్రజల్లో అవగాహన పెరగడంతో తగ్గుముఖం పడుతోంది. మన దేశంలోనూ ఎయిడ్స్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఎయిడ్స్ వ్యాప్తిలో మిజోరం తొలి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో దీని వ్యాప్తి 2.73 శాతంగా ఉంది. రెండు, మూడు స్థానాల్లో నాగాలాండ్ (1.37%), మణిపూర్ (0.87%) ఉన్నాయి. 4, 5 స్థానాల్లో ఏపీ, (0.62%), తెలంగాణ (0.44%) […]