Andhrabeats

కుప్పంలో చంద్రబాబు గృహప్రవేశం

 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం గ్రామంలో నిర్మించిన అత్యంత విలాసవంతమైన నివాసంలోకి గృహప్రవేశం చేశారు. శివపురం గ్రామంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ నివాసం, ఖరీదైన నిర్మాణ సామగ్రి, ఆధునిక సౌకర్యాలతో కూడిన రాజభవన శైలిలో రూపొందించబడింది. ఇటలీ నుండి దిగుమతి చేసిన మార్బుల్, అరుదైన చెక్కతో తయారైన ఫర్నిచర్, విలాసవంతమైన ఇంటీరియర్ డిజైన్‌లు ఈ భవనాన్ని ఒక ప్యాలెస్‌ను తలపించేలా చేశాయి.  ఈ గృహప్రవేశ […]

పాజిటివ్ మైండ్‌సెట్‌తో చిరంజీవి అగ్ర నటుడయ్యారు : సీఎం చంద్రబాబు

నమ్మకానికి సంకల్పం తోడైతే ఎటువంటి సవాళ్లనైనా అధిగమించవచ్చునని, మనిషి దృఢ సంకల్పం ఎంతలా పని చేస్తుందనడానికి ఎన్టీఆర్ జీవితమే ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైడ్‌సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలి కాపీని మెగాస్టార్ చిరంజీవికి అందించారు. అనంతరం శరణి అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. నారాయణ కూతుళ్ల ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయా నారాయణ కూతుళ్లను […]

ఓ పుట్టినరోజు… ఓ నాయకత్వ గాథ!

cbn

2025 ఏప్రిల్ 20న, ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో అగ్రగామిగా నిలిచిన నారా చంద్రబాబు నాయుడు తన 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడిగా, ఆయన రాజకీయ జీవితం విజయాలు, సవాళ్లు, వివాదాలు, కుటుంబ బంధాలు, అసాధారణ వ్యూహాలతో నిండిన ఒక సినిమాటిక్ కథలా సాగింది. రాజకీయ సామ్రాజ్యంలో నాలుగుసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం కేవలం రాజకీయ అవకాశం కాదు. అది ఆయన రాజకీయ తెలివి, […]

20 లక్షల కుటుంబాలను ధనికులు దత్తత తీసుకోవాలి : చంద్రబాబు

రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ4 విధానం ద్వారా ప్లాట్‌ఫామ్ నిర్మిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ – పీ4 విధానంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని, ఎవరినీ ఇందుకోసం ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్నారైలు కూడా పీ4లో భాగస్వాములు కావొచ్చని.. గతంలో తన హయాంలో చేపట్టిన జన్మభూమి తరహాలోనే పీ4 కార్యక్రమానికి […]

కూటమిలో సుడిగుండాలు తప్పవేమో!

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. అలాటిది కూటమి ఒరలో మూడు కత్తులు –చంద్రబాబు; అయన కొడుకు లోకేష్; కూటమి కూర్పులో సూత్రధారి అయిన పవన్ కళ్యాణ్. ఇలా అయితే కలహాల కాపురం కాక మరేమవుద్ది. కూటమి విజయ పరంపర కు తానే కారణం అని పవన్ భావన. అది నిజం కూడా కావొచ్చేమో! బాబు మరోసారి అధికార పీఠం ఎక్కడానికి బీజేపీ తో సంధి కుదరడం కీలకంగా మారింది. అలాటి కూటమి రధచక్రానికి పవన్ ఇరుసు […]

ధార్‌’ గ్యాంగ్‌.. దొంగతనాలే వారి ప్రవృత్తి

ధార్ గ్యాంగ్.. దొంగతనాల్లో ఈ గ్యాంగ్ స్టైలే వేరు. ఎక్కడి నుంచో వచ్చి రాష్ట్ర సరిహద్దుల్లో దజ్జాగా దోపిడీలు చేసి వెళ్ళిపోతారు. ఇటీవల అనంతపురంలో జరిగిన భారీ దోపిడీ ఈ గ్యాంగ్ పనే అని తేలింది. అనంతపురం నగర శివారు శ్రీనగర్‌ కాలనీలో కొన్ని రోజుల కిందట జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు దొంగలను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.90 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు, […]

ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు

  ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. పెట్టుబడి తగ్గించి రైతులను ఆప్పుల ఊబి నుండి బయటకు తీసుకొచ్చి ఉపశమనం కలిగించడంతో పాటు ఆదాయం పెంచాలన్నదే తమ సంకల్పమన్నారు. […]

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు

బాపట్ల మున్సిపల్‌ హైస్కూల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులతో ఉల్లాసంగా గడిపారు. క్లాస్‌ రూమ్‌లకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కష్టపడి చదువుకోవాలని, చదువుకుంటేనే మంచి భవిష్యత్‌ ఉంటుందని సూచించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి కింద కూర్చుని భోజనం చేశారు. చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌ కూడా ఉన్నారు. బాపట్ల మున్సిపల్‌ స్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్స్‌–టీచర్స్‌ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నిరంతరం నేర్చుకోవడం […]

అమరావతిలో చంద్రబాబు సొంతిల్లు

Chandrababu plot in Amaravati

నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రెండవసారి పనిచేస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఆయన ఏపీలో సొంతిల్లు సమకూర్చుకోలేదు. అమరావతిలోని ఉండవల్లి కరకట్టపై పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌కి చెందిన అతిథి గృహాన్ని తన నివాసంగా మార్చుకుని ఏడేళ్లుగా అక్కడే ఉంటున్నారు. దీనిపై చాలా విమర్శలు, వివాదాలు ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నా ఏపీలో ఇల్లు కట్టుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అమరావతిలో సొంతిల్లు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల అమరావతిలో ఇంటి స్థలం కొనుగోలు చేశారు. రాజధానిలోని వివిధ […]

నా పాలన ఎలా ఉందో చెప్పండి : చంద్రబాబు

తన పాలన ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎపీ సీఎం చంద్రబాబు ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై IVRS (Interactive Voice Response System) ఫోన్లు చేసి అమలు తీరును తెలుసుకుంటామని ప్రకటించారు. లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది. ఈ క్రమంలో లబ్ధిదారుల నుంచి ఆయా పథకాల […]