Andhrabeats

గంటలో 5 చైన్ స్నాచింగ్ లు.. హడలెత్తించిన ఆ ఇద్దరు

గంట వ్యవధిలో ఒకే ప్రాంతంలో ఐదుగురు మహిళల మెడలో బంగారు గొలుసులు తెంపుకుని పరారయ్యారు ఇద్దరు దొంగలు. తూర్పుగోదావరి జిల్లా కుమారదేవానికి చెందిన నక్కా ధనలక్ష్మి కొవ్వూరు పట్టణంలోని స్టేట్‌బ్యాంకుకు వెళ్లేందుకు జూనియర్‌ కళాశాల ఎదురు వీధిలో నడుస్తున్నారు. సరిగ్గా అప్పుడే శిరస్త్రాణం ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చారు. వెనుక నుంచి ఆమె మెడలోని మూడున్నర కాసుల బంగారు గొలుసు లాక్కుని ముందుకెళ్లిపోగా, ధనలక్ష్మి కింద పడిపోయారు. ఈ ఘటన […]

డెడ్ బాడీ పార్సిల్ కేసులో ట్విస్టులే ట్విస్టులు

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డెడ్ బాడీ పార్సిల్ కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆస్తి కోసమే ఈ వ్యవహారం అంతా చోటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలింది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న శ్రీధర్ వర్మ తన వదిన సాగి తులసి ఆస్తిని కాజేయాలనే యోచనతో ఈ పథకం రచించాడు. మొదట ఒక సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అందిస్తున్నట్లు కథ నడిపించాడు. ఆదేక్రమంలో […]

పార్సిల్‌లో డెడ్‌ బాడీ.. షాక్‌ తిన్న మహిళ

  పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో డెడ్‌బాడీ కలకలం రేపింది. ఆ డెడ్‌బాడి పార్శిల్‌లో రావడంతో అంతా భయపడిపోయారు. ఉండి మండలం యండగండిలో తులసి అనే మహిళకు ఓ పార్శిల్‌ వచ్చింది. అందులో ఎలక్ట్రిక్‌ పరికరాలు ఉన్నాయంటూ పార్శిల్‌ తెచ్చిన వ్యక్తి చెప్పి.. ఇచ్చి వెళ్లిపోయాడు. కాసేపు ఆగిన తర్వాత పార్శిల్‌ ఓపెన్‌ చేసిన తులసి కాళ్లు చేతులు వణికిపోయాయి. పార్శిల్‌లో కుళ్లిన డెడ్‌బాడీని చూసిన తులసికి ఏం చేయాలో అర్థం కాలేదు. అందర్నీ పిలిచి చూపించింది. […]

భార్యను చంపి.. పశ్చాత్తాపంతో ఆమె సమాధి వద్ద బలవన్మరణం

భార్యతో గొడవపడ్డ ఓ భర్త క్షణికావేశంలో కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో భార్య చనిపోయింది. దీంతో జైలుపాలైన భర్త ఆరు నెలల తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి భార్య సమాధి వద్దే ఉరి వేసుకుని చనిపోయాడు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఆదివారం జరిగిందీ ఘటన. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకుప్పం మండలం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి, సుజాత దంపతులు బెంగళూరుకు వలస వెళ్లారు. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ […]

ప్రేమించలేదని బాలికను సజీవ దహనం చేసిన బాలుడు

ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రేమించ‌లేద‌నే కార‌ణంతో బాలిక‌పై బాలుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ బాలిక మృతి చెందింది. బాలుడికి కూడా మంట‌లు అంటుకోవ‌డంతో గాయాల‌య్యాయి. వెల్దుర్తి మండ‌లం సామ‌ర్లకోట‌కు చెందిన బాలిక, క‌లుగొట్ల‌కు చెందిన బాలుడు ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతున్నారు. బాలుడు కొంత‌కాలంగా బాలిక‌ను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విష‌యం బాలిక త‌న పేరెంట్స్‌కు చెప్పింది. దాంతో వారు బాలిక‌ను ఆమె అమ్మ‌మ్మ ఉండే […]

ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసిన భార్య

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసింది ఒక భార్య. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం సోలిశెట్టిపల్లిలో ఈ దారుణం జరిగింది. గోవిందప్ప(38)కు 15 ఏళ్ల కిందట గుడుపల్లి మండలం పెద్దవంకకు చెందిన మీనాతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. ఈ నెల 4 నుంచి భర్త కనిపించడం లేదంటూ 5వ తేదీన మీనా రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు. […]

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్యులు మృతి

అనంతపురం జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో కారు నుజ్జునుజ్జు కాగా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దట్టమైన మంచు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులు బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్‌ గుర్తించారు. వీరంతా హాంకాంగ్‌ విహారయాత్రకు […]

విశాఖలో బస్సు పై యాసిడ్ దాడి.. ముగ్గురు మహిళలకు గాయాలు

విశాఖపట్నంలో ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ బాటిల్ తో దాడి చేశాడు. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ బస్సుపై యాసిడ్ విసిరాడు. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలపై అది పడింది. ఈ ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. విశాఖలోని ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి బీఆర్టీఎస్ రహదారిపై ప్రయాణిస్తున్న 28ఎ/జీ ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ విసిరాడు. దీంతో బస్సులో కిటికీ పక్కన […]

నెల్లూరులో హిజ్రా లీడర్ దారుణ హత్య !

  నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం టపాతోపు వద్ద దారుణం జరిగింది. హిజ్రా నాయకురాలు హాసినిని రెండు కార్లలో వచ్చిన దుండగులు కత్తులతో పొడిచి పరారయ్యారు. వెంటనే108లో నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పార్లపల్లిలోని గుడిలో పూజలు నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ హత్య జరిగింది. హాసినికి తిరుపతి, నెల్లూరులో పెద్ద సంఖ్యలో అనుచరులున్నారు. హిజ్రా గ్రూపుల్లో హాసినికి మంచి పలుకుబడి ఉంది. ఆమెను ఎందుకు హత్య […]