Andhrabeats

10 నెలల తర్వాత ముత్యాలరాజుకి పోస్టింగ్‌

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా పనిచేసిన నలుగురు ఐఏఎస్‌ అధికారులకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. 10 నెలలపాటు వారిని వెయిటింగ్‌లో ఉంచి ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించింది. రేవు ముత్యాలరాజు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. జగన్‌కు అత్యంత సన్నిహితంగా పనిచేయడంతో ఆయన వైసీపీ ముద్ర వేశారు. ఆ కారణంగానే పోస్టింగ్‌ ఇవ్వలేదు. దాదాపు 10 నెలలపాటు ఆయన్ను జీఏడీలోనే ఖాళీగా ఉంచింది. అయితే ఆయన […]