Andhrabeats

చైనా పేల్చిన ఆర్థిక బాంబ్‌ — డాలర్‌ రాజ్యం కూలిపోతోందా?

 

చైనా తీసుకున్న డిజిటల్ యువాన్ నిర్ణయం ప్రపంచ ఆర్థిక పటాన్ని మార్చేస్తోంది. అమెరికా ఆధిపత్యంలో నడుస్తున్న డాలర్ స్విఫ్ట్ వ్యవస్థకు ఇది సవాల్. 7 సెకన్లలో చెల్లింపులు, తక్కువ ఖర్చు.. దీన్ని డీ–డాలరైజేషన్‌ దిశలో చైనా వేసిన చరిత్రాత్మక అడుగుగా ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.

అమెరికా ఆధిపత్యానికి ముగింపు — డిజిటల్ యువాన్‌తో గ్లోబల్ ఫైనాన్స్‌లో కొత్త యుగం

చైనా ప్రపంచ ఆర్థిక పటాన్ని తారుమారు చేసే మరో భారీ అడుగు వేసింది. అమెరికా ఆధిపత్యంలో నడుస్తున్న డాలర్‌ ఆధారిత స్విఫ్ట్‌ వ్యవస్థను పక్కనపెట్టి డిజిటల్ యువాన్‌ (Digital RMB) వ్యవస్థను అధికారికంగా అంతర్జాతీయ వేదికపై ప్రవేశపెట్టింది.

ఇప్పటికే 10 ఆసియన్‌ దేశాలు, 6 మధ్యప్రాచ్య దేశాలు ఈ వ్యవస్థకు అనుసంధానమవుతున్నాయి. అంటే ప్రపంచ వ్యాపారంలో దాదాపు 38 శాతం లావాదేవీలు ఇకపై అమెరికా డాలర్‌ను కాదని నేరుగా డిజిటల్ యువాన్‌ మార్గంలో సాగనున్నాయి. ఇది గ్లోబల్ ఫైనాన్స్‌ చరిత్రలో చైనాకు బలమైన మైలురాయి.

 “7 సెకన్లలో చెల్లింపు” — డాలర్‌ వ్యవస్థకు షాక్‌!

ఇంతవరకు ఒక దేశం నుంచి మరో దేశానికి డబ్బు చేరడానికి 3–5 రోజులు పట్టేది. ఇప్పుడు చైనా రూపొందించిన డిజిటల్ కరెన్సీ బ్రిడ్జ్‌ ద్వారా కేవలం 7 సెకన్లలోనే చెల్లింపు పూర్తవుతుంది!

హాంకాంగ్‌–అబుదాబీ మధ్య జరిగిన ట్రయల్‌లో ఒక కంపెనీ చెల్లింపు నేరుగా సరఫరాదారుడి ఖాతాలో చేరింది. ఆరు బ్యాంకులు ద్వారా చేయాల్సిన లావాదేవీ డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ ద్వారా రియల్‌టైమ్‌లో జరిగిపోయింది. ఫలితంగా ట్రాన్సాక్షన్‌ ఖర్చులు 98% తగ్గాయి.

పారదర్శకత, వేగం, భద్రత — ఇవే డిజిటల్‌ యువాన్‌ బలం

చైనాకు చెందిన బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఈ చెల్లింపు వ్యవస్థకు అసలు బలం. అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయి, అక్రమ డబ్బు బదిలీలను ఆటోమేటిక్‌గా గుర్తించే సదుపాయం ఉంది.

చైనా–ఇండోనేషియా “టూ కంట్రీస్‌ టూ పార్క్స్‌” ప్రాజెక్ట్‌లో కేవలం 8 సెకన్లలో చెల్లింపు పూర్తయింది — ఇది పాత బ్యాంకింగ్‌ పద్ధతికంటే 100 రెట్లు వేగంగా ఉందని చైనా ఇండస్ట్రియల్‌ బ్యాంక్‌ తెలిపింది.

 “డీ–డాలరైజేషన్” దిశగా వేగంగా అడుగులు

ప్రస్తుతం 23 దేశాల సెంట్రల్‌ బ్యాంకులు చైనా ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థను పరీక్షిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలు, ఎనర్జీ వ్యాపారులు ఈ పద్ధతి వలన 75% లావాదేవీ ఖర్చులు తగ్గించుకున్నారు.

ఇదే సమయంలో, ఆసియన్‌ దేశాల మధ్య RMB లావాదేవీలు 2024లో ₹5.8 ట్రిలియన్ యువాన్‌ దాటాయి — 2021తో పోలిస్తే 120% వృద్ధి. మలేసియా, సింగపూర్‌ దేశాలు తమ విదేశీ నిల్వల్లో యువాన్‌ను చేర్చుకున్నాయి. థాయ్‌లాండ్‌ అయితే ఇప్పటికే డిజిటల్‌ RMBతో చమురు లావాదేవీ కూడా చేసింది.

 “డిజిటల్‌ సిల్క్‌ రోడ్‌” — చైనాకు దూరదృష్టి పథకం

చైనా లక్ష్యం కేవలం చెల్లింపులు కాదు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌తో కలిపి డిజిటల్‌ యువాన్‌ను ఉపయోగించి డిజిటల్‌ సిల్క్‌ రోడ్‌ నిర్మిస్తోంది. చైనా–లావోస్‌ రైల్వే, జకార్తా–బాండుంగ్‌ హైస్పీడ్‌ రైల్వే వంటి ప్రాజెక్టుల్లో ఈ డిజిటల్‌ కరెన్సీని బీడౌ నావిగేషన్‌, క్వాంటం కమ్యూనికేషన్‌తో కలిపి వినియోగిస్తున్నారు. ఫలితంగా వ్యాపార సామర్థ్యం 400% పెరిగిందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా ఇంకా చర్చల్లోనే… చైనా మాత్రం పరుగు

ఇప్పటికే ప్రపంచంలోని 87% దేశాలు డిజిటల్‌ RMB సిస్టమ్‌ను స్వీకరించడానికి సిద్ధమయ్యాయి. ఈ వ్యవస్థ ద్వారా జరిగిన అంతర్జాతీయ చెల్లింపులు $1.2 ట్రిలియన్‌ దాటాయి.

అమెరికా ఇంకా “డిజిటల్‌ కరెన్సీ డాలర్‌ స్థితిని దెబ్బతీస్తుందా?” అని చర్చిస్తుంటే, చైనా మాత్రం 200 దేశాల్లో తన డిజిటల్‌ చెల్లింపు నెట్‌వర్క్‌ను సృష్టించి ముందుకెళ్లింది.

ఇది కేవలం ఆర్థిక మార్పు కాదు — ప్రపంచ ఆధిపత్యానికి ప్రారంభమైన సాంకేతిక యుద్ధం!

డిజిటల్‌ యువాన్‌తో చైనా ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ చూపుతోంది.
అమెరికా ఆధిపత్యానికి సవాల్‌ విసురుతూ, “డీ–డాలరైజేషన్” యుగానికి నాంది పలుకుతోంది.

చైనా తీసుకున్న ఈ అడుగు… ప్రపంచ ఫైనాన్స్‌ చరిత్రలో గోల్డెన్‌ టర్నింగ్‌ పాయింట్‌ అని అర్ధిక వేత్తలు అంచనా వేస్తున్నారు. 

TOP STORIES