రాజధాని నగరంలో ఉండవల్లి పరిధిలోని కొండవీటివాగు స్లూయిస్ వద్ద రెండు లైన్లతో వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.55.58 కోట్లను కేటాయించింది. ఈ మేరకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. 12 నెలల కాలపరిమితితో దీన్ని పూర్తి చేయాలని, మరో 12 నెలలు నిర్మాణ సంస్థ నిర్వహించాలని అందులో పేర్కొంది. ప్రస్తుతం కొండవీటివాగు వద్ద కరకట్టకు ఉన్న స్లూయిస్ వద్ద సింగిల్ లైను మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులందరూ నిత్యం ఈ వంతెన మీద నుంచే ప్రయాణించాల్సి వస్తోంది. సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. దీంతో స్లూయిస్ వద్ద రెండు లైన్ల బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018-19లోనే ఇక్కడ వంతెన నిర్మించాలని నిర్ణయించినా అప్పట్లో ప్రభుత్వాలు మారడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇప్పుడు కొత్తగా రెండు లైన్ల వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ప్యాకేజీ నెంబరు 53లో భాగంగా రెగ్యులేటర్ వద్ద కొత్తగా కొండవీటివాగు, గుంటూరు ఛానెల్కు షిప్ లాక్, రెగ్యులేటర్ నిర్మించనున్నారు. కృష్ణా పశ్చిమ కెనాలు ఉన్నట్లు ఆధునిక రహదారి ఏర్పాటు చేయనున్నారు.
వల్లభనేని సురేష్
9010099208
అమరావతి కరకట్టపై కొత్త బ్రిడ్జి
RECENT POSTS
-
అమరావతిలో కొత్త ల్యాండ్ పూలింగ్: ప్రభుత్వం చెప్పేదేంటి? వాస్తవాలేంటి?
-
చమురు మీద దురాశ.. సార్వభౌమత్వంపై దాడి
-
తప్పుడు రిజిస్ట్రేషన్లు ఇక అంత ఈజీ కాదు
-
ఇండిగో సంక్షోభం – అసలు కారణం ఇదే -
అమరావతి కరకట్టపై కొత్త బ్రిడ్జి -
టీఆర్పీల కోసం రూ.100 కోట్ల లంచం -
డ్రై సిటీస్.. ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న నీటి కొరత -
ఐబొమ్మ రవి: ఒకే ఒక్క వ్యక్తి అంత పెద్ద పైరసీ సామ్రాజ్యం ఎలా నిర్మించాడు? -
తెరుచుకున్న శబరిమల ఆలయం* -
AP ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026




