20 లక్షల కుటుంబాలను ధనికులు దత్తత తీసుకోవాలి : చంద్రబాబు

రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ4 విధానం ద్వారా ప్లాట్ఫామ్ నిర్మిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ – పీ4 విధానంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని, ఎవరినీ ఇందుకోసం ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్నారైలు కూడా పీ4లో భాగస్వాములు కావొచ్చని.. గతంలో తన హయాంలో చేపట్టిన జన్మభూమి తరహాలోనే పీ4 కార్యక్రమానికి […]
ఎంపీల వేతనాల పెంపు: కేంద్రం కీలక నిర్ణయం

మన పార్లమెంటు సభ్యులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఎంపీల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్లలో 24% పెంపును ప్రకటించింది. ఈ నిర్ణయం 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చినప్పటికీ, తాజాగా దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ మార్చి 24, 2025న విడుదలైంది. ఈ పెంపుతో ఎంపీల నెలవారీ వేతనం రూ.1 లక్ష నుంచి రూ.1.24 లక్షలకు చేరుకుంది. వేతనాలతో పాటు అలవెన్సుల్లోనూ మార్పు ఈ సవరణలో భాగంగా, ఎంపీలకు రోజువారీ భత్యం రూ.2,000 నుంచి రూ.2,500కు పెంచారు. […]
ఎస్సీ వర్గీకరణతో ఎవరికి మేలు !

ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణ అనేది దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉంది. ఈ విషయం రాష్ట్రంలోని వివిధ ఎస్సీ సముదాయాల మధ్య సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం నడిచిన పోరాటంలో ముఖ్యమైన అంశం. 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ దీర్ఘకాల డిమాండ్కు కొత్త ఊపిరి పోసింది. చారిత్రక నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ డిమాండ్ 1994లో మదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS ) ఆధ్వర్యంలో ప్రారంభమైంది. మదిగ సమాజం, రాష్ట్రంలోని ఎస్సీలలో […]
నల్లమల అభయారణ్యంలో ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల ప్రాంతాలకు ప్రయాణించేవారికి గుడ్న్యూస్. ఈ మార్గంలో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ కారిడార్ పూర్తయితే.. తెలంగాణ-ఏపీ మధ్య ప్రయాణం 45 నిమిషాలు తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి..? ఎంత ఖర్చవుతుంది..? ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.. తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-విజయవాడ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకలు సాగిస్తుంటారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లేవారితో పాటుగా.. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేవారు ఈ హైవే పైనే వెళ్తుంటారు. […]
పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు

ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు, ఇతర వర్గాలకు పంపిణీ చేస్తున్న పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మార్చి నెలకు గాను ఇచ్చే పెన్షన్లలో ఈ మార్పులు వర్తింపచేయనున్నారు. పెన్షనర్ల సౌలభ్యం కోసం ఈ మార్పులు చేస్తున్నట్లు సెర్ఫ్ సీఈవో వాకాటి కరుణ తెలిపారు. ఇందులో టైమింగ్స్ మార్పు సహా పలు అంశాలున్నాయి. పెన్షన్ల పంపిణీలో నాణ్యత, పెన్షన్ దారుల సంతృప్తి మెరుగుపర్చేందుకు పెన్షన్ల పంపిణీ యాప్ లో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో […]
పోసాని కృష్ణమురళి అరెస్టు

నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఏపీ పోలీసులు హైదరాబాద్ లో ఆయనను అరెస్ట్ చేశారు. రాయచోటి పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై ఆరోపణలు ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదైంది. 352(2) 111 R/W (3)5 […]
తలకోన అడవిలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

మహా శివరాత్రి సందర్భంగా కాలినడకన శైవక్షేత్రానికి వెళ్లి శివయ్యను దర్శించుకొందామని వెళ్తున్న భక్తులపై.. మార్గం మధ్యలో గజరాజుల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 26 మంది ప్రాణ భయంతో పరుగు తీశారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులైన భక్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శివరాత్రి సందర్భంగా దశాబ్దాలుగా వైకోట నుంచి శేషాచలం దట్టమైన అటవీ మార్గం మీదుగా […]
కూటమిలో సుడిగుండాలు తప్పవేమో!

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. అలాటిది కూటమి ఒరలో మూడు కత్తులు –చంద్రబాబు; అయన కొడుకు లోకేష్; కూటమి కూర్పులో సూత్రధారి అయిన పవన్ కళ్యాణ్. ఇలా అయితే కలహాల కాపురం కాక మరేమవుద్ది. కూటమి విజయ పరంపర కు తానే కారణం అని పవన్ భావన. అది నిజం కూడా కావొచ్చేమో! బాబు మరోసారి అధికార పీఠం ఎక్కడానికి బీజేపీ తో సంధి కుదరడం కీలకంగా మారింది. అలాటి కూటమి రధచక్రానికి పవన్ ఇరుసు […]
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

హైదరాబాద్ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఇప్పటికే చాలా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా… హైదరాబాదులో ఉన్న వల్లభనేని వంశీని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. ఇవాళ ఉదయం అరెస్టు చేసిన తర్వాత విజయవాడకు వల్లభనేని వంశీని తరలిస్తున్నారు. అయితే ఏ కేసులో వల్లభనేని వంశీని అరెస్టు […]
ఏపీకి మరో కొత్త హైవే

ఆంధ్రప్రదేశ్ కు మరో కొత్త జాతీయ రహదారి మంజూరు అయింది. ఈ నేషనల్ హైవే తో పిడుగురాళ్ళ మీదుగా హైదరాబాద్కు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ నేషనల్ హైవే పనులు వేగవంతం చేస్తున్నారు. నేషనల్ హైవే 167ఏ గా పిలిచే ఈ రోడ్డు వాడరేవు నుంచి పిడుగురాళ్ల ను కలుపుతుంది. తాజాగా బాపట్ల జిల్లాలో పనుల్ని వేగవంత చేశారు. జాతీయ రహదారుల నిర్మాణాలతో పలు జిల్లాలో రూపురేఖలు మారుతున్నాయి. కోస్తాలో కీలకమైన వాడరేవు- పిడుగురాళ్ల జాతీయ రహదారి పనుల్లో […]