ఎంపీల వేతనాల పెంపు: కేంద్రం కీలక నిర్ణయం

మన పార్లమెంటు సభ్యులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఎంపీల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్లలో 24% పెంపును ప్రకటించింది. ఈ నిర్ణయం 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చినప్పటికీ, తాజాగా దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ మార్చి 24, 2025న విడుదలైంది. ఈ పెంపుతో ఎంపీల నెలవారీ వేతనం రూ.1 లక్ష నుంచి రూ.1.24 లక్షలకు చేరుకుంది. వేతనాలతో పాటు అలవెన్సుల్లోనూ మార్పు ఈ సవరణలో భాగంగా, ఎంపీలకు రోజువారీ భత్యం రూ.2,000 నుంచి రూ.2,500కు పెంచారు. […]
నల్లమల అభయారణ్యంలో ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల ప్రాంతాలకు ప్రయాణించేవారికి గుడ్న్యూస్. ఈ మార్గంలో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ కారిడార్ పూర్తయితే.. తెలంగాణ-ఏపీ మధ్య ప్రయాణం 45 నిమిషాలు తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి..? ఎంత ఖర్చవుతుంది..? ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.. తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-విజయవాడ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకలు సాగిస్తుంటారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లేవారితో పాటుగా.. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేవారు ఈ హైవే పైనే వెళ్తుంటారు. […]
తలకోన అడవిలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

మహా శివరాత్రి సందర్భంగా కాలినడకన శైవక్షేత్రానికి వెళ్లి శివయ్యను దర్శించుకొందామని వెళ్తున్న భక్తులపై.. మార్గం మధ్యలో గజరాజుల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 26 మంది ప్రాణ భయంతో పరుగు తీశారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులైన భక్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శివరాత్రి సందర్భంగా దశాబ్దాలుగా వైకోట నుంచి శేషాచలం దట్టమైన అటవీ మార్గం మీదుగా […]
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

హైదరాబాద్ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఇప్పటికే చాలా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా… హైదరాబాదులో ఉన్న వల్లభనేని వంశీని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. ఇవాళ ఉదయం అరెస్టు చేసిన తర్వాత విజయవాడకు వల్లభనేని వంశీని తరలిస్తున్నారు. అయితే ఏ కేసులో వల్లభనేని వంశీని అరెస్టు […]
కమ్యూనిస్టు పార్టీల్లో అంతర్గత రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా?

తెలంగాణా సి.పి.ఎం. కార్యదర్సి పదవి ఒక దళితుడికి దక్కింది. మార్క్సిస్ట్ పార్టీలో పెద్ద పదవి ఒక మాదిగోడికి దక్కడమా? ఆదర్శాల ఆకాశం విరిగి పడిపోయిందా, ఏమిటి? ఈ దేశంలో విప్లవం కమ్మవాళ్లూ, రెడ్లూ తేవాలి తప్ప, మధ్యలో ఈ ఎందుకూ కొరగాని మాలమాదిగలెవ్వరు? అసలేం జరుగుతోంది? పోనీ.. ఎందుకూ ఇలా జరిగింది? లేటుగా అయినా కామ్రేడ్స్ కి జ్ఞానోదయం అయింది అనుకోవాలా? ఇది మార్క్సిస్ట్పార్టీ మన మీద వేసిన క్రూయల్ జోకు కాదు కదా! అసలు ఎవరీ […]
కోళ్లకు అంతుచిక్కని వైరస్ : లక్షల్లో మృత్యువాత

కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్ పశ్చిమగోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారుజామున చనిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యాధి కారణంగా ఆ జిల్లాలో ఇప్పటివరకు లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయని తెలుస్తోంది. ముఖ్యంగా పందేలు కోసం ప్రత్యేకంగా పెంచిన కోళ్లు కూడా వైరస్ బారిన పడి మరణించాయి. దీంతో కోళ్ల పెంపకందారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇదే వైరస్ నాలుగేళ్ల క్రితం కూడా పశ్చిమగోదావరిలో […]
మాట వినలేదా? నచ్చలేదా? ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీల్లో ట్విస్టులు

ఏపీలో భారీగా జరిగిన ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏరికోరి కీలక పోస్టుల్లో కూర్చోబెట్టిన కొందరు అధికారులను ఈ బదిలీల్లో అంతగా ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి పంపారు. పూర్తిగా జగన్ మనషులుగా ముద్ర వేసిన పలువురు అధికారులకూ పోస్టింగ్లు లభించాయి. అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే తమకు పనికి వచ్చేవారెవరో? అవసరం లేని వారెవరో? కూటమి పెద్దలు ఒక అంచనాకు వచ్చి ఈ బదిలీలు చేసినట్లు కనబడుతోంది. బాగా […]
2024లో తిరుమల హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆదాయం రోజురోజుకీ పెరుగుతోంది. భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగిపోతుండడంతో హుండీ ఆదాయం కూడా అందుకు తగ్గట్టుగానే రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దీంతో ఆపద మొక్కులు తీర్చే వెంకన్న ఆస్తుల విలువ ప్రతి ఏడాది అమాంతం పెరుగుతోంది. 2024 సంవత్సరానికి సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం, ఇతర వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2024లో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపింది. మొత్తం 2.55 కోట్ల […]
సీఎస్గా బాధ్యతలు చేపట్టిన కే విజయానంద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) కె.విజయానంద్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సాయంత్రం వేదపండితుల ఆశీర్వచనాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ సీఎస్గా పని చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన విజయానంద్ను ఏపీ నూతన సీఎస్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29న జీఓ జారీ చేసిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. […]
సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్

సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్ గా జిల్లాల్లో పర్యటిస్తానని జగన్ తెలిపారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని, రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతానని చెప్పారు. ప్రతీ గ్రామంలో టీడీపీ, చంద్రబాబును ప్రశ్నించాలన్న జగన్.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమైందని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచి ఎంపీ వరకు ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ఉండాలన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా వీడియో తీసి అప్ లోడ్ చేయాలని […]