సీఎంగా బిహార్ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు?

బిహార్ ఎన్నికలకు మరో నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి – మళ్లీ నితీష్ కుమారే పీఠాన్ని అధిరోహిస్తారా? లేక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో కొత్త ముఖం కనిపిస్తుందా? ఇండియా టుడే-సి ఓటర్ సర్వేలో అనేక పేర్లు వెల్లడయ్యాయి. వీరిలో లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పేరు అగ్రస్థానంలో ఉంది. రెండవ పేరు ప్రశాంత్ కిషోర్ది. వీరి తర్వాతే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ […]
జగన్ కోటను చంద్రబాబు జయిస్తారా?

ఆగస్టు 12వ తేదీన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో హోరాహోరీ పోరుగా మారింది. కేవలం ఒక జెడ్పీటీసీ స్థానానికే ఎన్నిక అయినా దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటె ఇది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. పులివెందుల జగన్ సొంత నియోజకవర్గమే కాదు.. వైఎస్ఆర్ కుటుంబానికి బలమైన కోట. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ వైఎస్ కుటుంబానిదే గెలుపు. అక్కడ మరో పార్టీ వేలు పెట్టే అవకాశం కూడా […]
250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా : చంద్రబాబు

పీ4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి పీ4 కార్యక్రమంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో #IAmMargadarsi పోస్టర్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..”కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను. ఆ కుటుంబాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. మార్గదర్శులు ముందుకు రావాలని పిలుపు […]
పాజిటివ్ మైండ్సెట్తో చిరంజీవి అగ్ర నటుడయ్యారు : సీఎం చంద్రబాబు

నమ్మకానికి సంకల్పం తోడైతే ఎటువంటి సవాళ్లనైనా అధిగమించవచ్చునని, మనిషి దృఢ సంకల్పం ఎంతలా పని చేస్తుందనడానికి ఎన్టీఆర్ జీవితమే ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైడ్సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలి కాపీని మెగాస్టార్ చిరంజీవికి అందించారు. అనంతరం శరణి అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. నారాయణ కూతుళ్ల ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయా నారాయణ కూతుళ్లను […]
ఓ పుట్టినరోజు… ఓ నాయకత్వ గాథ!

2025 ఏప్రిల్ 20న, ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో అగ్రగామిగా నిలిచిన నారా చంద్రబాబు నాయుడు తన 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడిగా, ఆయన రాజకీయ జీవితం విజయాలు, సవాళ్లు, వివాదాలు, కుటుంబ బంధాలు, అసాధారణ వ్యూహాలతో నిండిన ఒక సినిమాటిక్ కథలా సాగింది. రాజకీయ సామ్రాజ్యంలో నాలుగుసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం కేవలం రాజకీయ అవకాశం కాదు. అది ఆయన రాజకీయ తెలివి, […]
వైసీపీలో అవమానాలు, కోటరీ పాలిటిక్స్ : విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. పార్టీలో తాను అనుభవించిన అవమానాలు, కోటరీ ఆధిపత్యం, లిక్కర్ స్కాం విచారణపై జరిపిన ప్రశ్నలకు సమాధానాల అంశాలపై ఆయన బహిరంగంగా మాట్లాడారు. మీడియాతో జరిగిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “నన్ను నెంబర్ 2 స్థానం నుంచి… 2000 స్థానానికి దించారు” వైసీపీ లో తాను నెంబర్ 2 స్థానంలో ఉన్నా, […]
ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ : గంటా నిర్వేదం

టీడీపీ సీనియర్ నాయకుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం నుంచి అమరావతి వెళ్లడానికి పడే ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ నిర్వేదం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ’ అంటూ ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం.. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో […]
ఏపీ కేబినెట్ సమావేశం: కీలక నిర్ణయాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో 24 ముఖ్యమైన అజెండా అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్య నిర్ణయాల వివరాలు 1. పరిశ్రమలకు భూమి కేటాయింపు రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోని ఐటీ హిల్-3 ప్రాంతంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) […]
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్తో రిజిస్ట్రేషన్లు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకునే విధానం ప్రారంభమైంది. శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ అధికారిక వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆరోజు ఆ సమయానికి కొచ్చి రిజిస్ట్రేషన్ […]
కొడాలి నానికి సీరియస్ : ప్రత్యేక విమానంలో ముంబయి ఆస్పత్రికి తరలింపు

గుండెపోటు గురైన వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని (54)ని (శ్రీ వెంకటేశ్వరరావు) ఆరోగ్య పరిస్థితి పార్టీ వర్గాలు, అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను సోమవారం హైదరాబాద్లోని ఏఏజీ ఆస్పత్రి నుంచి ప్రత్యేక విమానంలో ముంబయికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మార్చి 25వ తేదీన ఆయనకు గుండె సంబంధిత సమస్యలు […]