Andhrabeats

పాస్టర్ ప్రవీణ్ కేసులో కొత్త ట్విస్ట్

రాజమహేంద్రవరంలో ఇటీవల మృతి చెందిన పాస్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ విజయవాడలో మూడు గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌ బైక్‌పై బయలుదేరిన పాస్టర్‌ ఈనెల 24న విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్నారు. ప్రవీణ్‌ అలసిపోయి తన ద్విచక్ర వాహనాన్ని రామవరప్పాడు రింగ్‌కు 50 మీటర్లు ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోకి సాయంత్రం 5 గంటలకే చేరుకున్న ఆయన రాత్రి 8.45 గంటలకు […]

యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరీ

గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి తన కూతురికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్లు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన తురిమెల్ల కోటయ్య మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కూతురు ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తుందని, నాలుగు నెలల క్రితం లేడీ అఘోరి మంగళగిరి నేషనల్ హైవే మీద ఒంటి మీద బట్టలు లేకుండా హల్చల్ చేస్తుంటే పోలీసులు ఎవరైనా మహిళలు ఉంటే కొంచెం […]

ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. ఏం జరిగింది?

Delhi High Court Judge Yaswanth Varma case

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ చుట్టూ ఇటీవల చోటుచేసుకున్న వివాదం భారత న్యాయ వ్యవస్థలో పెను సంచలనం సృష్టించింది. మార్చి 14, 2025న ఆయన అధికారిక నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత అక్కడ భారీ మొత్తంలో నగదు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్‌ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. అంతేకాకుండా, ఈ ఆరోపణలపై అంతర్గత విచారణను ప్రారంభించడంతో ఈ వ్యవహారం […]

ఇజ్రాయెల్ మహిళా పర్యాటకురాలు, హోమ్ స్టే యజమానిపై గ్యాంగ్ రేప్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కర్ణాటకలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ మహిళా పర్యాటకురాలు, హోమ్ స్టే యజమానిపై ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. టెక్ హబ్ బెంగళూరు నుంచి 350 కి.మీ దూరంలో ఉన్న కొప్పల్‌ అనే ప్రాంతంలో తుంగభద్ర ఎడమ ఒడ్డున నక్షత్రాలను చూడటానికి ఐదుగురు వ్యక్తులు వెళ్లారు. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఇందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. ఒకరు అమెరికన్, […]

తలకోన అడవిలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

Elephants attack in Ap

మహా శివరాత్రి సందర్భంగా కాలినడకన శైవక్షేత్రానికి వెళ్లి శివయ్యను దర్శించుకొందామని వెళ్తున్న భక్తులపై.. మార్గం మధ్యలో గజరాజుల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 26 మంది ప్రాణ భయంతో పరుగు తీశారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులైన భక్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శివరాత్రి సందర్భంగా దశాబ్దాలుగా వైకోట నుంచి శేషాచలం దట్టమైన అటవీ మార్గం మీదుగా […]

ప్రేమించలేదని నోట్లో యాసిడ్‌ పోసి.. కత్తితో పొడిచాడు

Acid attack in girl at ap

త్వరలో పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడుపుదామనుకున్న ఆ యువతి కలలను ఒక ప్రేమోన్మాది చిదిమేశాడు. ప్రేమికుల రోజే ఆమె జీవితాన్ని విషాదంలో ముంచేశాడు. తనను ప్రేమించడంలేదని ఒక యువతిపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. బలవంతంగా నోట్లో యాసిడ్‌ పోసి తాగించి, ఆపై కత్తితో శరీరంపై ఇష్టానుసారం పొడిచి పైశాచికానందం పొందాడు. ఆ యువతి ప్రస్తుతం ప్రాణపాయస్థితిలో బెంగుళూరు ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. గుర్రంకొండ మండలంలోని నడిమికండ్రిగ […]

ధార్‌’ గ్యాంగ్‌.. దొంగతనాలే వారి ప్రవృత్తి

ధార్ గ్యాంగ్.. దొంగతనాల్లో ఈ గ్యాంగ్ స్టైలే వేరు. ఎక్కడి నుంచో వచ్చి రాష్ట్ర సరిహద్దుల్లో దజ్జాగా దోపిడీలు చేసి వెళ్ళిపోతారు. ఇటీవల అనంతపురంలో జరిగిన భారీ దోపిడీ ఈ గ్యాంగ్ పనే అని తేలింది. అనంతపురం నగర శివారు శ్రీనగర్‌ కాలనీలో కొన్ని రోజుల కిందట జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు దొంగలను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.90 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు, […]

గంటలో 5 చైన్ స్నాచింగ్ లు.. హడలెత్తించిన ఆ ఇద్దరు

గంట వ్యవధిలో ఒకే ప్రాంతంలో ఐదుగురు మహిళల మెడలో బంగారు గొలుసులు తెంపుకుని పరారయ్యారు ఇద్దరు దొంగలు. తూర్పుగోదావరి జిల్లా కుమారదేవానికి చెందిన నక్కా ధనలక్ష్మి కొవ్వూరు పట్టణంలోని స్టేట్‌బ్యాంకుకు వెళ్లేందుకు జూనియర్‌ కళాశాల ఎదురు వీధిలో నడుస్తున్నారు. సరిగ్గా అప్పుడే శిరస్త్రాణం ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చారు. వెనుక నుంచి ఆమె మెడలోని మూడున్నర కాసుల బంగారు గొలుసు లాక్కుని ముందుకెళ్లిపోగా, ధనలక్ష్మి కింద పడిపోయారు. ఈ ఘటన […]

ఆత్మహత్యలు మగవాళ్లవే ఎక్కువ

ఆడవాళ్ల కంటే మగాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసింది. కుటుంబ సమస్యలే అందుకు ప్రధాన కారణమని తెలిపింది. 2015 నుంచి 2022 వరకు కుటుంబ సమస్యల కారణంగా 242,909 (23.06%) మంది మగాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలో తెలిపింది. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో 1,40,441 (21.05%) పురుషులు ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించింది. డ్రగ్స్, లిక్కర్‌ అలవాటుతో 60,571 మంది, అప్పుల వలన 39,419 మంది, ప్రేమ వ్యవహారాలతో 28,055 మంది, వివాహ […]

సైబర్‌ నేరాలన్నీ వాట్సప్‌తోనే

ఈ ఇంటర్నెట్‌ యుగంలో సైబర్‌ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంథాలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. భారీ లాభాల పేరుతో ఆశజూపడం లేదా డిజిటల్‌ అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు గుంజుతున్నారు. ఈ మోసాలకు సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా మెసేజింగ్‌ ప్లాట్‌ఫాట్‌ ‘వాట్సప్‌’నే వినియోగిస్తున్నారట..! ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. వాట్సప్‌ వేదికగా స్కామర్లు ఎక్కువగా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారని హోంమంత్రిత్వ శాఖ (MHA) పేర్కొంది. ఆ తర్వాత ఈ […]