Andhrabeats

అమరావతిలో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం !

Andhra Cricket Association Stadium in Amaravathi

రాజధాని నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మించాలని భావిస్తోంది. ఈ స్పోర్ట్స్‌ సిటీలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రికెట్‌ స్టేడియం నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించింది. అమరావతి అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి ఐసీసీ అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ కేశినేని చిన్ని ఈ విషయాన్ని వెల్లడించారు. అమరావతిలో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియానికి ఐసీసీ ఛైర్మన్‌ జైషా అనుమతి ఇచ్చినట్లు కేశినేని శివనాథ్‌ […]

పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు

ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు, ఇతర వర్గాలకు పంపిణీ చేస్తున్న పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మార్చి నెలకు గాను ఇచ్చే పెన్షన్లలో ఈ మార్పులు వర్తింపచేయనున్నారు. పెన్షనర్ల సౌలభ్యం కోసం ఈ మార్పులు చేస్తున్నట్లు సెర్ఫ్ సీఈవో వాకాటి కరుణ తెలిపారు. ఇందులో టైమింగ్స్ మార్పు సహా పలు అంశాలున్నాయి. పెన్షన్ల పంపిణీలో నాణ్యత, పెన్షన్ దారుల సంతృప్తి మెరుగుపర్చేందుకు పెన్షన్ల పంపిణీ యాప్ లో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో […]

పోసాని కృష్ణమురళి అరెస్టు

నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఏపీ పోలీసులు హైదరాబాద్ లో ఆయనను అరెస్ట్ చేశారు. రాయచోటి పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై ఆరోపణలు ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదైంది. 352(2) 111 R/W (3)5 […]

బాలయ్యను వరించిన పద్మ భూషణ్

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 139 పద్మ అవార్డులను ప్రకటించగా, అందులో 113 మంది పద్మశ్రీ అందుకోనున్నారు. ఈ క్రమంలో మన నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. కళా రంగం కేటగిరిలో ఆయన్ను నామినేట్ చేయగా కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం అయిన పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. దీంతో బాలయ్య అభిమానులు, తెలుగు దేశం కార్యకర్తలు, సినీ ప్రముఖులు సంతోషం […]

కోళ్లకు అంతుచిక్కని వైరస్ : లక్షల్లో మృత్యువాత

కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్‌ పశ్చిమగోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారుజామున చనిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యాధి కారణంగా ఆ జిల్లాలో ఇప్పటివరకు లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయని తెలుస్తోంది. ముఖ్యంగా పందేలు కోసం ప్రత్యేకంగా పెంచిన కోళ్లు కూడా వైరస్‌ బారిన పడి మరణించాయి. దీంతో కోళ్ల పెంపకందారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇదే వైరస్‌ నాలుగేళ్ల క్రితం కూడా పశ్చిమగోదావరిలో […]

జేఈఈ మెయిన్‌ రాస్తున్నారా.. వీటి గురించి తెలుసుకోండి

దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ) మెయిన్-2025 మొదటి సెషన్‌ పరీక్షలు ఈ నెల 22 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ నెల 22, 23, 24, 28, 29వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లలో పేపర్‌-1(బీఈ, బీటెక్‌) ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈ నెల 30న మధ్యాహ్నం పేపర్‌-2 బీఆర్క్‌ పరీక్ష జరగనుంది.  నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో ఈ ఆన్‌లైన్‌ […]

ఈ ఆడ పులి 3 రాష్ట్రాలను హడలెత్తించింది

Tiger Jeenath

దట్టమైన అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఒక ఆడ పులి మూడు రాష్ట్రాలను ముప్పతిప్పులు పెట్టింది. దాని శరీరానికి అమర్చిన రేడియో కాలర్‌ ద్వారా అది ఎక్కడికెక్కడికి వెళుతుందో తెలుసుకుంటూ అనేక చోట్ల ఉచ్చులు వేసినా ఎక్కడా చిక్కకుండా తప్పించుకుని తిరిగింది. 21 రోజులపాటు ఒడిస్సా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల అటవీ ప్రాంతాల్లోని 300 కిలోమీటర్ల మేర అది ప్రయాణించింది. మధ్యలో కొన్నిసార్లు జనావాసాలకు దగ్గరగా రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోయారు. మూడు రాష్ట్రాల […]

రాసిచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు

  వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకుంటే వారికి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తమ పిల్లలకు ఆస్తిని రాసిస్తూ చేసిన గిఫ్ట్‌, సెటిల్‌మెంట్‌ డీడ్లను నిబంధనల ప్రకారం రద్దు చేసుకునే వెసులుబాటునిచ్చింది. నిబంధనల ప్రకారం ట్రిబ్యునల్‌ అధికారిగా ఉన్న ఆర్డీవో నుంచి వీటికి సంబంధించి వచ్చిన ఆదేశాలను పాటించి సంబంధిత డాక్యుమెంట్లను రద్దు చేయాలని సబ్‌ రిజిస్ట్రార్లకు ఆదేశాలిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ శేషగిరిబాబు మంగళవారం ఒక […]

ఇకపై ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఉండవు !

విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా ఇంటర్మీడియేట్ విద్యలో సంస్కరణలు తీసుకురావాలని చూస్తున్నామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా  తెలిపారు. ఇంటర్మీడియేట్ విద్యా మండలి ప్రతిపాదిత విద్యా సంస్కరణలపై బుధవారం తాడేపల్లిలోని ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కార్యదర్శి కృతికా శుక్లా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో తీసుకువచ్చే సంస్కరణల ఫలితాలు 10 లక్షల మంది విద్యార్ధుల జీవితాలకు సంబంధించిన విషయమని అందుకే […]

దేశంలో నకిలీ యూనివర్సిటీలివే

Fake Universites in India

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) భారతదేశంలో చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసింది. ఇవి నకిలీ యూనివర్సిటీలను ఇవి జారీ చేసే డిగ్రీలు చెల్లవని తెలిపింది. ఈ సంస్థలు చట్టబద్ధమైన అనుమతులేకుండా డిగ్రీలు అందిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థులు యూనివర్సిటీల గురించి తెలుసుకునేందుకు యూజీసీ అధికారిక లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌లను చూడాలని సూచించింది. నకిలీ విశ్వవిద్యాలయాలు అంటే ఏమిటి? నకిలీ విశ్వవిద్యాలయాలు అనేవి చట్టబద్ధమైన నియంత్రణ సంస్థల గుర్తింపును పొందకుండా చట్టవిరుద్ధంగా డిగ్రీలు అందిస్తాయి. […]