రూ.337 లక్షల కోట్లు.. భారత ప్రజల వద్ద ఉన్న బంగారం విలువ

బంగారం అంటే భారతీయుల ప్రాణం! సంపద, శుభం, గౌరవం – ఈ మూడు ఒక్క మాటతో చెప్పాలంటే “పసిడి” అనే చెప్పాలి. వందల ఏళ్లుగా బంగారం భారతీయుల జీవనంలో అంతర్భాగమై ఉంది. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు అన్నింటికీ బంగారం లేకపోతే ‘పూర్తి’ అనిపించదు. కానీ, ఇప్పుడు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు – ఒక ఆర్థిక భద్రతా సాధనం, పెట్టుబడి రూపంగా మారిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో సులభంగా నగదుగా మార్చుకునే ఆస్తిగా ప్రజలు దీన్ని భావిస్తున్నారు. […]
బాలయ్య స్టైల్ రగడ– చిరు క్లాస్ కౌంటర్

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టించాయి. బాలయ్య కెలికిన రచ్చకు చిరంజీవి లేఖ రూపంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో, ఈ ఇష్యూ సోషల్ మీడియా నుంచి సామాన్యుల చర్చల వరకూ వైరల్ అయ్యింది. అసెంబ్లీలో బాలయ్య ఫైర్: “ఎవడు గట్టిగా అడిగాడు?” శాసనసభలో శాంతిభద్రతల అంశంపై చర్చ జరుగుతుండగా, బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్, జగన్ […]
విశాఖ భూ కుంభకోణంలో సీఎంఓ ముఖ్య అధికారి

సీఎంవో అధికారి ముద్దాడ రవిచంద్రపై జనసేన నేత మూర్తియాదవ్ ఆరోపణలు విశాఖపట్నం జిల్లా ఎండాడలో చోటుచేసుకున్న రూ.100 కోట్ల భూ కుంభకోణం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ప్రభుత్వ రికార్డుల్లో గయాలుగా ఉన్న భూమి, ఒక్కసారిగా ప్రైవేట్ పేర్లకు బదిలీ అవడం, ఆ ప్రక్రియలో సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ప్రమేయం ఉందని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలా మొదలైంది? సర్వే నంబర్ 14/1లోని 5.10 ఎకరాల భూమి […]
దేవా కట్టా: పొలిటికల్ థ్రిల్లర్ల మాస్టర్!

దర్శకుడు దేవా కట్టా ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్’ చిత్రాలతో పొలిటికల్ థ్రిల్లర్లలో తన నైపుణ్యాన్ని చూపించాడు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో నాయకుల కథను ‘మయసభ’ వెబ్ సిరీస్ ద్వారా తెరపైకి తెచ్చాడు. సోనీ లివ్లో విడుదలైన ఈ సిరీస్ ఆనాటి రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారిని ఆకట్టుకుంటుంది. సినిమాగా తీస్తే సెన్సార్ కత్తెరలో సగం కథ నలిగిపోయేది! తెలుగు రాష్ట్రాల రాజకీయాలను నెగటివ్గా చూపడం సర్వసాధారణం, కానీ వాటి మూలాలను తవ్వి చూపిన చిత్రాలు చాలా తక్కువ. […]
ప్రతి అక్షరం ఒక మంచి ఆహారాన్ని సూచిస్తుంది

ఆహారమే ఆరోగ్యానికి మూలం. మనం తీసుకునే ఆహారం శరీరాన్ని బలంగా, మనసును ఉల్లాసంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచే, శక్తిని అందించే, జీర్ణవ్యవస్థను మెరుగుపరచే ఆహార పదార్థాలను A నుండి Z వరకూ తెలుసుకుంటే, ఆరోగ్యకర జీవితం సులభమవుతుంది. ప్రతి అక్షరం ఒక మంచి ఆహారాన్ని సూచిస్తుంది. A – Amla (ఉసిరికాయ): విటమిన్ C అధికంగా ఉండే ఈ పండు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణవ్యవస్థకు, చర్మ ఆరోగ్యానికి మేలు. B – Banana (అరటి […]
SBI శాలరీ అకౌంట్తో రూ.కోటి ఇన్సూరెన్స్ పూర్తిగా ఉచితం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాలరీ అకౌంట్ హోల్డర్లకు రూ.1 కోటి వరకు ఉచిత ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ.100 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందిస్తోంది, కానీ చాలామందికి ఈ సౌలభ్యం తెలియదు. సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం వేరియంట్ల ఆధారంగా కవరేజ్ మారుతుంది, డెబిట్ కార్డు లావాదేవీలు, యాక్టివ్ శాలరీ క్రెడిట్తో అర్హత లభిస్తుంది. జీరో బ్యాలెన్స్, ఉచిత ఏటీఎం లావాదేవీలు, లోన్ రాయితీలు, ఓవర్డ్రాఫ్ట్, ఆటో-స్వీప్ వంటి అదనపు ప్రయోజనాలు […]
నానో ఎరువుల వినియోగం అత్యంత అవసరం

విజయవాడలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో నానో సాంకేతికత గురించి ఒక కార్యశాల జరిగింది. ఈ కార్యశాలలో రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు (IAS), ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ శారద జయలక్ష్మి దేవి, పరిశోధన సంచాలకులు డాక్టర్ పీ.వీ. సత్యనారాయణ హాజరయ్యారు. డిల్లీ రావు ప్రసంగం డిల్లీ రావు మాట్లాడుతూ, భారతదేశ వ్యవసాయ రంగం ఎరువుల కోసం భాస్వరం, పొటాష్, గంధకం వంటి ముడి సరుకులను […]
మూడేళ్లలో విజయవాడ, విశాఖ మెట్రోలు పూర్తి చేస్తాం

మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను రానున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. శుక్రవారం లెనిన్ సెంటర్ లోని సీఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం విశాఖపట్టణం, విజయవాడలలో మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందన్నారు. ఫీజుబుల్టీ రెపోర్టు స్టడీ చేయడానికి ఆరు నెలలు సమయం పట్టిందన్నారు. కేంద్రం అనుమతించిన మేరకు మెట్రో రైల్ […]
అంతరించిపోతున్న పిడకలు

యమలీల సినిమాలో బ్రహ్మానందం కోట శ్రీనివాసరావుని అడుగుతాడు.. అయ్యా.. ఆ పిడకలు గోడ మీదకి ఎలా వచ్చాయని.. ఆవులు గోడ ఎక్కి పేడ వెయ్యడం వల్ల అని మళ్లీ తనే సర్దుకుంటాడు. ఇప్పుడున్న జనరేషన్ పరిస్థితి కూడా ఎగ్జాక్ట్లీ అదే.. ఈ పిడకల గురించి ఇప్పుడున్న వారికి చాలా మందికి తెలియదు.. 1985 ప్రాంతంలో అనుకుంటా…మా ఊళ్ళో గార్లమ్మ గుడికాడ డబ్బాల మంగమ్మ (వాళ్ళాయన బియ్యం పెట్టెలు, డబ్బాలు తయారుచేసేవాడు)అని పెదరాసి పెద్దమ్మలా ఒకావిడ ఉండేది…ఆవిడ ఎవరైనా […]
కుప్పంలో చంద్రబాబు గృహప్రవేశం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం గ్రామంలో నిర్మించిన అత్యంత విలాసవంతమైన నివాసంలోకి గృహప్రవేశం చేశారు. శివపురం గ్రామంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ నివాసం, ఖరీదైన నిర్మాణ సామగ్రి, ఆధునిక సౌకర్యాలతో కూడిన రాజభవన శైలిలో రూపొందించబడింది. ఇటలీ నుండి దిగుమతి చేసిన మార్బుల్, అరుదైన చెక్కతో తయారైన ఫర్నిచర్, విలాసవంతమైన ఇంటీరియర్ డిజైన్లు ఈ భవనాన్ని ఒక ప్యాలెస్ను తలపించేలా చేశాయి. ఈ గృహప్రవేశ […]