ధార్’ గ్యాంగ్.. దొంగతనాలే వారి ప్రవృత్తి

ధార్ గ్యాంగ్.. దొంగతనాల్లో ఈ గ్యాంగ్ స్టైలే వేరు. ఎక్కడి నుంచో వచ్చి రాష్ట్ర సరిహద్దుల్లో దజ్జాగా దోపిడీలు చేసి వెళ్ళిపోతారు. ఇటీవల అనంతపురంలో జరిగిన భారీ దోపిడీ ఈ గ్యాంగ్ పనే అని తేలింది. అనంతపురం నగర శివారు శ్రీనగర్ కాలనీలో కొన్ని రోజుల కిందట జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్లోని ధార్ ప్రాంతానికి చెందిన ముగ్గురు దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.90 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు, […]
జగన్ సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

వైసీపీ అధ్యక్షుడు జగన్ కు వ్యతిరేకంగా ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ ఆయన వేసిన పిటిషన్ను జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్చంద్ర శర్మ ధర్మాసనం న్యాయస్థానం తోసిపుచ్చింది. బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని, అలాంటప్పుడు రద్దు అవసరమే లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ లేదని వ్యాఖ్యానించింది. అలాగే సీబీఐ కేసులను మరో […]
తొక్కిసలాటను తక్కువ చేసి చూపుతున్నారు : జగన్

తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి జగన్ ప్రెస్మీట్ ముఖ్యాంశాలు ఇది కచ్చితంగా ప్రభుత్వ తప్పిదం. సీఎం మొదలు, టీటీడీ అధికారులు, ఛైర్మన్, జిల్లా ఎస్పీ, కలెక్టర్ అందరూ బాధ్యులే. అందుకే వారందరిపై కచ్చితంగా చర్యలు చేపట్టాలి. తొక్కిసలాటను తక్కువ చేసి చూపుతూ, తప్పుడు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీఎన్ఎస్ 194–సెక్షన్కు బదులు బీఎన్ఎస్ 105– సెక్షన్ కింద […]
ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్ళాల్సి వస్తుందనుకోలేదు : వైయస్ జగన్

ఇడుపులపాయలో కడప కార్పొరేటర్లు, ముఖ్యనేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు, ఈ సమావేశంలో వారినుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే… ప్రజలకిచ్చిన మాట మీద నిలబడి, ప్రజల కష్టాలను నా కష్టాలుగా భావించి, ప్రజలకు మంచి చేశాం, ఈ రోజు కూడా ప్రతి ఇంటికీ మనం కాలర్ ఎగరవేసుకుని వెళ్ళగలుగుతాం, ప్రతి ఇంట్లో మనం చెప్పింది చేశామనే మాట ప్రజల నుంచి వినిపిస్తుంది, ప్రజలు సంతోషంగా మీరు చేశారంటున్నారు, అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల […]
వైఎస్ జగన్ పరువు నష్టం దావా కేసు- ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అదానీ గ్రూప్ వ్యవహారంలో తనపై తప్పుడు వార్తలు రాసి పరువుకు భంగం కలిగించారంటూ ఆ రెండు పత్రికలపై వైఎస్ జగన్ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అదానీ గ్రూప్ అవినీతి కేసుకు సంబంధించి అమెరికాలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పేరు లేకున్నా, ఉన్నట్లుగా కట్టు కథలు […]
సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్

సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్ గా జిల్లాల్లో పర్యటిస్తానని జగన్ తెలిపారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని, రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతానని చెప్పారు. ప్రతీ గ్రామంలో టీడీపీ, చంద్రబాబును ప్రశ్నించాలన్న జగన్.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమైందని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచి ఎంపీ వరకు ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ఉండాలన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా వీడియో తీసి అప్ లోడ్ చేయాలని […]
ఆ పత్రికలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నా : మాజీ సీఎం జగన్

అదానీ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ బీఐ ఛార్జిషీటులో తన పేరు ఎక్కడా లేదని జగన్ అన్నారు. అదానీతో భేటీకి, విద్యుత్ ఒప్పందాలకు సంబంధమే లేదని ఆయన స్పష్టం చేశారు. నాకు లంచం ఆఫర్ చేసినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గురువారం ఆయన తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వాస్తవాలు తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. తన పరువు, ప్రతిష్టలు దెబ్బతీసేవారిపై […]