Andhrabeats

అమరావతి కాంట్రాక్ట్‌ల్లో భారీ అవినీతి

  అమరావతి రాజధానిలో జరుగుతున్న పనుల్లో కూటమి సర్కార్ భారీ అవినీతికి తెర తీసిందని వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తనకు అనుకూలమైన ఎనిమిది సంస్థలకే 59 ప్యాకేజీల కింద మొత్తం రూ.28,210 కోట్ల విలువైన పనులను కట్టబెట్టారని అన్నారు. వీటికి మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల కింద ఇచ్చే రూ.2821 కోట్ల నుంచే 8 శాతం కమిషన్లుగా దండుకుంటున్నారని […]

వైసీపీ నేత పేర్ని నానికి షాక్‌

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్‌ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. నాని నిర్వహిస్తున్న గోడౌన్‌లో రేషన్‌ బియ్యం గల్లంతు కావడంపై కేసు నమోదయింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న గోడౌన్‌లో దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మన్‌జీర్‌ జిలానీ ఆదేశించారు. బియ్యం గల్లంతు విషయంలో నానిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నాని రూ.1.80 కోట్లు […]

పవన్‌ను షిప్‌ ఎక్కనివ్వొద్దని చంద్రబాబు చెప్పారేమో?

పవన్‌ కల్యాణ్‌ తన శాఖ కాకపోయినా కూడా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లినందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మచిలీపట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. అనుభవమున్న రంగం కాబట్టి షిప్‌ చుట్టూ గిరగిరా తిరుగుతూ  వీడియోలు తీశారని, మంచి ప్రయత్నమే కానీ పవన్‌ పర్యటనపై అంతా అనుమానంగానే ఉందని అన్నారు. పోర్టు ఆఫీసర్, కస్టమ్స్‌ ఆఫీసర్‌ పవన్‌తో బోటులోనే ఉన్నారని తెలిపారు. వాళ్లిద్దరూ షిప్‌లోనే ఉండి పవన్‌కు పర్మిషన్‌ ఎందుకు […]

సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్

  సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్ గా జిల్లాల్లో పర్యటిస్తానని జగన్ తెలిపారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని, రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతానని చెప్పారు. ప్రతీ గ్రామంలో టీడీపీ, చంద్రబాబును ప్రశ్నించాలన్న జగన్.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమైందని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచి ఎంపీ వరకు ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ఉండాలన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా వీడియో తీసి అప్ లోడ్ చేయాలని […]

ఆ పత్రికలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నా : మాజీ సీఎం జగన్

అదానీ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ బీఐ ఛార్జిషీటులో తన పేరు ఎక్కడా లేదని జగన్ అన్నారు. అదానీతో భేటీకి, విద్యుత్ ఒప్పందాలకు సంబంధమే లేదని ఆయన స్పష్టం చేశారు. నాకు లంచం ఆఫర్ చేసినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గురువారం ఆయన తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వాస్తవాలు తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. తన పరువు, ప్రతిష్టలు దెబ్బతీసేవారిపై […]